ఘనంగా పంద్రాగస్టు వేడుకలు…

 

మండల వ్యాప్తంగా జాతీయ జెండా ఆవిష్కరణలు

కేసముద్రం ఆగస్టు 15 జనం సాక్షి /మండల వ్యాప్తంగా సోమవారం 76వ స్వతంత్ర వేడుకలు ఘనంగా జాతీయ జెండాలను ఆవిష్కరణలు చేసి నిర్వహించుకున్నారు.స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో తహసిల్దార్ ఫరీదోద్దీన్,ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ఓలం చంద్రమోహన్, వ్యవసాయ మార్కెట్లో చైర్మన్ మర్రి నారాయణరావు,మేజర్ గ్రామపంచాయతీలో సర్పంచ్ బట్టు శ్రీనివాస్,టిఆర్ఎస్ మండల కార్యాలయంలో మండల అధ్యక్షులు నజీర్ అహ్మద్,పోలీస్ స్టేషన్లో ఎస్సై రమేష్ బాబు,శ్రీ వివేకవర్ధని హైస్కూల్లో కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్,ప్రభుత్వ ప్రైవేట్ రంగ పాఠశాలల్లో,కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణలు గావించారు.అనంతరం మిఠాయిలు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.