ఘనంగా మల్దకల్ శ్రీ తిమ్మప్ప స్వామి తెప్పోత్సవం

మల్దకల్ డిసెంబర్ 7(జనంసాక్షి)జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో బుధవారం తెప్పోత్సవ కార్యక్రమాన్ని కోనేరులో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలంపూర్ జూనియర్ సివిల్ జడ్జి కవిత వెంకటకవీంద్ర దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.వారికి దేవాలయ చైర్మన్ ప్రహల్లాద రావు, కార్యనిర్వాణాధికారి సత్య చంద్రారెడ్డి,అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం దేవాలయంలో పూజలు నిర్వహించి ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపుగా బయలుదేరి సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన కోనేరులో స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగ నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.కార్యక్రమంలో సింగల్ విండో అధ్యక్షుడు తిమ్మారెడ్డి,టిఆర్ఎస్ నాయకులు సత్యారెడ్డి,విక్రమ్ సింహారెడ్డి, మధుసూదన్ రెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి,వెంకటన్న, మధు, పద్మారెడ్డి ,బాబురావు, అరవింద్ రావు, చంద్రశేఖర రావు ,ప్రముఖులు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.అనంతరం శేష వాహనంపై స్వామి వారిని ఊరేగింపుగా తీసుకువెళ్లారు.