ఘనంగా వజ్రోత్సవ ముగ్గుల పోటీలు

సర్పంచ్ బొబ్బ లక్ష్మి

డోర్నకల్ ఆగస్టు 20 జనం సాక్షి

స్వతంత్ర్య భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా డోర్నకల్ మండల పరిధిలోని ఉన్న పెరుమళ్ళ సంకీస గ్రామంలో సర్పంచ్ బొబ్బ లక్ష్మి అధ్యక్షతన ఆగష్టు 8 నుండి ఆగష్టు 22 వరకు అనగా 15 రోజుల పాటు ప్రతిరోజు ఒక్కో సేవా కార్యక్రమంచేస్తున్నారని,అందులో భాగంగా శనివారం గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు.
పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.కార్యక్రమంలో గ్రామ పంచాయితీ ప్రజలు,మహిళలు సిబ్బంది తదితరలు పాల్గొన్నారు