-->

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి

హుస్నాబాద్ రూరల్ ఆగస్టు 18(జనంసాక్షి) సర్దార్ సర్వాయి పాపన్న 372 వ జయంతిని పురస్కరించుకుని పొట్లపల్లి గ్రామంలోని కాకతీయుల ప్రతీక బురుజు వద్ద బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మరియు గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి మార్క అనిల్ గౌడ్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులు ఎక్సైజ్ శాఖ సబ్ ఇన్స్పెక్టర్ దామోదర్ సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర గురించి గర్వంగా చెప్పడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.స్థానిక వార్డు సభ్యులు పాకాల శ్యాంసుందర్ గౌడ్, గీత కార్మిక సహకార సంఘం నాయకులు మార్క చంద్రయ్య ,చెప్పాలా మల్లయ్య, బత్తిని వెంకటరాజ,ఎల్లయ్య, రాజయ్య, రామచంద్రం, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.