ఘోర రోడ్డుప్రమాదంలో 8 మంది మృతి

41469358274_625x300చెన్నై: తమిళనాడులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కృష్ణగిరి సమీపంలోని శూలగిరి వద్ద  ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు.. కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందగా.. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.