చందానగర్ ఫుటోవర్ బ్రిడ్జితో పాదచారులకు ఎంతో మేలు – ప్రభుత్వవిప్ అరికెపూడి గాంధీ”

శేరిలింగంప‌ల్లి, ఆగస్టు 26( జనంసాక్షి): శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ పరిధిలోని విజేత సూపర్ మార్కెట్ ఎదురుగా నిర్మిస్తున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి వల్ల స్థానిక పాదచారులకు, ప్రయాణికులకు ఎంతోమేలు చేకూరుతుందని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డి, జిహెచ్ఎంసి, ఆర్ అండ్ బి అధికారులతో కలిసి శుక్రవారం నిర్మాణం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్ లో విజేత సూపర్ మార్కెట్ ఎదురుగా ప్రధాన రహదారి పై నూతనంగా నిర్మిస్తున్న పాదచారుల వంతెన పూర్తయిన వెంటనే ప్రజలకు అందుబాటులోకి వస్తుందని తద్వారా స్థానిక ఆదచారులకు, ఇతర ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ప్రజల సౌకర్యార్థం రోడ్డు దాటే పాదచారుల సమస్యలను పరిష్కరించే దిశగా అవసరమైన ప్రాంతాలను గుర్తించి అక్కడ నిర్మించాల్సిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి లకు స్థలాలను నిర్ణయించడమైనదన్నారు. నిత్యం రద్దీగావుండే ప్రాంతాలను, ప్రజలు ఎక్కువగా తిరిగే ప్రాంతాలను, ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను పరిగణలోకి తీసుకొని ఫుట్ ఓవర్ బ్రిడ్జి లను నిర్మించడం ప్రభుత్వ బాధ్యత అని, అందులో భాగంగా పనుల పురోగతులను పరిశీలించడం జరిగినదని వివరించారు. రోడ్డుదాటే వృద్దులకు, పిల్లలకు, పాదచారులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అనువైన, సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తున్నామని, పుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలను ప్రకటనలకు మాత్రమే కాకుండా ప్రజలకు ఉపయోగపడేలా,ప్రమాద రహిత ప్రాంతలుగా తీర్చిదిద్దడమే ముఖ్య లక్ష్యం గాంధీ తెలిపారు. ట్రాఫిక్ సమస్య ఉన్నచోట మాత్రమే నిర్మాణము చేపట్టేలా చూడాలని, ట్రాఫిక్ రహిత, ప్రమాద రహితంగా తీర్చిదిద్దాలని, పుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీపడకుండా ఫుటోవర్ బ్రిడ్జిని నిర్మించాలని గాంధీ గారు తెలియజేస్తూ అధికారులకు పలు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. కరోనావంటి విపత్కర పరిస్థితుల్లో అభివృద్ధికి ఎటువంటి లోటు లేకుండా ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం మౌలిక వసతులు కల్పించడంలో ప్రత్యేక శ్రద్ద కనబరుస్తోంది అని ప్రభుత్వ విప్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు EE శ్రీకాంతిని ,DE స్రవంతి , AE శివప్రసాద్ , R & B EE ధర్మారెడ్డి, DE రామకృష్ణ , మరియు మాజీ కౌన్సిలర్ రవీందర్ రావు ,చందానగర్ డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి తెరాస నాయకులు ఓ. వెంకటేష్, పులిపాటి నాగరాజు, నరేందర్ బల్లా , హరీష్ రెడ్డి, దాస్, కార్తీక్ గౌడ్, అమిత్ దూబే , ప్రవీణ్ ,రాజశేఖర్ రెడ్డి, శంకర్ రావు, అశోక్, వరలక్ష్మి రెడ్డి స్థానికులు తదితరులు పాల్గొన్నారు.