చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి.

మల్కాజిగిరి.జనంసాక్షి.జూలై 30.
ప్రతి పౌరునికి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని మల్కాజిగిరి తహసిల్దార్ నిర్మలా నాయక్ అన్నారు.ప్రతి నెల 30వ తారీఖున నిర్వహించే పౌర హక్కుల దినోత్సవంలో భాగంగా శనివారం గౌతంనగర్ డివిజన్ లోని ఇందిరా నెహ్రూ కమ్యూనిటీ హాల్ లో “సివిల్ రైట్స్ డే” కార్యక్రమం ఏర్పాటు చేసి చట్టాలపై అవగాహన కల్పించారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.ప్రతి పౌరుడు తమ హక్కులను వినియోగించు కోవడంతో పాటు ఎస్సీ,ఎస్టీ కేసులపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు.ఎస్సీ,ఎస్టీలు ఏసమస్య ఉన్నా మా దృష్టికి
తీసుకువస్తే న్యాయపరంగా వారికి సహకరిస్తామని తెలిపారు.ఈకార్యక్రమంలో గిర్ధావర్ శ్రీశైలం,ఎస్ఐ శ్రీనివాస్,కార్యాలయ సిబ్బంది రాములు,ప్రభుదాస్ స్థానికులు పాల్గొన్నారు.