చత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళ కుటుంబానికి ఆర్థిక చేయూత

చింతలపాలెం — జనంసాక్షి

సూర్యాపేట జిల్లా,చింతలపాలెం మండలం,దొండపాడు గ్రామంలో ఇటీవల విద్యుత్ షాక్ కు గురైన మహిళ కుటుంబానికి తమ వంతు సహాయంగా చత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 కేజీల బియ్యం,కూరగాయలు,పండ్లు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో చత్రపతి శివాజీ పౌండేషన్ అధ్యక్షుడు కటికార్ల శివ మరియు పిల్లుట్ల గోపి,అన్నపురెడ్డి గోపిరెడ్డి, దాసరి సురేష్ తదితరులు పాల్గొన్నారు.