చరిత్రలో నిలిచిపోయేలా పుష్కరాల నిర్వహణ

గుంటూరు: కృష్ణా పుష్కరాలను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. లక్షలాది మంది భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని పెద్దయెత్తున ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పనుల నాణ్యతలో ఎవరైనా గుత్తేదారు రాజీపడితే అలాంటి వారిని బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని హెచ్చరించారు. త్వరలో ప్రత్యేక హోదా సాకారమయ్యే అవకాశముందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భాజపా తమకు మిత్రపక్షమైనప్పటికీ ప్రత్యేకహోదా విషయంలో రాజీలేని పోరాటం చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ప్రత్యేక హోదాపై ఇంకా కాలయాపనకేంద్రానికి తగదన్నారు. కేసుల మాఫీ కోసమే ప్రతిపక్ష నేత జగన్‌ దిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు.