చల్లగా చూడు తల్లి

నర్సింహులపేట ఆగస్టు 10 జనం సాక్షి

మండలానికి చెందిన కొమ్ములవంచ గ్రామంలో బోనాల పండుగ ఉత్సవాలును పురస్కరించుకొని ఆనవాయితీ ప్రకారం మొదటగా విశ్వబ్రాహ్మణులు గ్రామ దేవత అయిన ముత్యాలమ్మ తల్లి ని పంచామృతాలతో అభిషేకించి,పట్టు వస్త్రములు కట్టి, పసుపు,కుంకుమ పువ్వులతో అలంకరించారు. అనంతరం బోనం ధూప దీప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతేకాకుండా తమ పిల్లా పాపలు,గొడ్డు గోదా చల్లగా ఉండాలని,పాడి పంటలు సమృద్ధిగా పండాలని ముత్యాలమ్మ తల్లిని వేడుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ దాస రోజు వెంకటేశ్వర్లు, విశ్వబ్రాహ్మణ సంఘం బాధ్యులు దేవేంద్ర చారి, బాబు చారి, వీరాచారి, రామాచారి,వేణుగోపాల చారి, రాజశేఖర్,ప్రవీణ్, రామ్మోహన్,శ్రీనివాస్, నవీన్, శ్రవణ్ కుమార్ ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు.