చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణకు ఆహ్వానం

శంకరపట్నం జనం సాక్ష సెప్టెంబర్ 19
మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను సోమవారం శంకరపట్నం మండల రజక సంఘం నాయకులు మర్యాదపూర్వం క్యాంప్ కార్యాలయంలో కలిసి సన్మానం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మానకొండూర్ నియోజకవర్గం రజక సంఘం ఇన్చార్జి నాంపల్లి శంకరయ్య రజక మాట్లాడారు. మండల కేంద్రంలోని కేశవపట్నం బస్టాండ్ ఎదుట మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రత్యేక చొరవ తీసుకొని, సాయుధ పోరాట యోధురాలు రజక బిడ్డ చాకలి ఐలమ్మ విగ్రహo ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చాకలి ఐలమ్మ విగ్రహం ఆవిష్కరణకు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే సహాయ సహకారాలతో ఐలమ్మ విగ్రహాన్ని, ఈ నెల 24వ తేదీన ఆవిష్కరించి, 26న చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గంట మహిపాల్, హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చౌడమల్ల వీరస్వామి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉమ్మెoతల సతీష్ రెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్ కల్లేపల్లి క్రాంతి కుమార్, ఉపాధ్యక్షులు నాంపల్లి ఆదిత్య, ప్రచార కార్యదర్శులు నేరెళ్ల సంతోష్ కుమార్, రాస మల్ల అనిల్ కోశాధికారి కల్లేపల్లి కిరణ్, తదితరులు పాల్గొన్నారు.