చెత్త తరలింపునకు అన్ని వసతులు కల్పిస్తాం

25వ డివిజన్ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి
మేడిపల్లి – జనంసాక్షి
చెత్త తరలింపునకు కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తామని 25వ డివిజన్ కార్పొరేటర్ దొంతిరి హరి శంకర్ రెడ్డి తెలిపారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్  25వ డివిజన్లోని మహాత్మ జ్యోతిబా పూలే తెలంగాణ బిసి వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్  లో కార్పొరేటర్ తో కలిసి మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ రావు, ఎస్సై జానకి పర్యటించి తడి, పొడి చెత్త వేరు చేసే విధానాన్ని అవగాహన కల్పించారు. వచ్చిన చెత్తను వేరుచేస్తూ సలీడ్ వెస్ట్ ఇంటిగ్రేటెడ్ పార్క్ (డంపింగ్ యార్డ్)కు పంపించేందుకు కావాల్సిన సదుపాయాలను కల్పిస్తామని కార్పొరేటర్, కమిషనర్ పాఠశాల యాజమాన్యానికి హామీ ఇచ్చారు. పాఠశాల ఆవరణలో విద్యార్థుల భోజనశాలను పరిశీలించి, అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మేడిపల్లిలో పర్యటించారు. పాఠశాల చుట్టు ప్రహరీ గోడ, కొత్తగా ఏర్పాటు చేస్తున్న టాయిలెట్స్ నిర్మాణాన్ని పరిశీలించారు.