చేవెళ్ల ఆగస్టు 20 (జనంసాక్షి) చేవెళ్ల శ్రీ లక్ష్మీవెంకటేశ్వర స్వామి

దేవాలయం ఆవరణలో శనివారం గంప జాతర ఘనంగా నిర్వహించారు. శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి పల్లకి సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతి ఏడాది పంటలు బాగా పండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని ఈ జాతర నిర్వహిస్తామని పూజారి శ్రీపాద్ తెలిపారు. అనంతరం భక్తులు దేవాలయ ప్రాంగణంలో వంటావార్పు చేసి అక్కడే భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల సర్పంచ్ బండారి శైలజ ఆగిరెడ్డి చేవెళ్ల పిఎసిఎస్ చైర్మన్ దేవర వెంకటరెడ్డి మహిళా అధ్యక్షురాలు దేవర సమత భక్తులు పెంజర్ల వెంకట్ రెడ్డి తిరుపతి రెడ్డి చాకలి ప్రశాంత్ పూజారులు వాసుదేవ్ చారి శ్రీకాంత్ చారి తదితరులు ఉన్నారు