చౌడాపూర్ మండల కేంద్రంలో ఫ్రీడం 2K రన్

చౌడాపూర్, ఆగస్టు 11( జనం సాక్షి ): వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్రంలో 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా విద్యార్థులకు మరియు మండల నాయకులకు జడ్పిటిసి రాందాస్ నాయక్ ఫ్రీడం 2K రన్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రాందాసు నాయక్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు కూడా చెప్పి ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర మూడు రోజులపాటు జెండా ఎగరవేయాలని సూచించారు. స్థానిక సర్పంచ్ కొత్త రంగారెడ్డి, ఎంపీటీసీ శంకర్, మందిపల్ ఎంపిటిసి తనయుడు చిలకల శంకర్, వార్డ్ మెంబర్ అశోక్,గౌస్,రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు యాదయ్య,చౌడాపూర్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు తిమ్య,పోలీసు బృందం మరియు ఆశ వర్కర్లు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.