ఛత్తిస్గఢ్లో రోడ్డు ప్రమాదం : 10 మంది మృతి
ఛత్తిస్గఢ్, మార్చి 17 : ఛత్తీస్గఢ్లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న బస్సు అదుపుతప్పి బ్రిడ్జి రైలింగ్ను ఢీ కొట్టింది. మోర్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదన్పూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రతకు వంతెన పై నుంచి కొంతమంది కిందపడిపోయారు. వారిలో 10 మంది మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగే సమయంలో బస్సులో 35 మంది ప్రయాణీకులు ఉన్నారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.