ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల క్యాంప్‌లు..

ఛత్తీస్‌గఢ్ : కాంకేర్ జిల్లాలో 12కు పైగా మావోయిస్టుల క్యాంపులను పోలీసులు ధ్వంసం చేశారు. క్యాంపుల నుంచి భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ పరిసర ప్రాంతాలను భద్రతా బలగాలు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి. దంతెవాడ జిల్లాలో ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా, ఒక పోలీసు తీవ్రంగా గాయపడిన విషయం విదితమే.