జంతర్‌మంతర్‌ వద్ద ఢిల్లీ తెలంగాణ జేఏసీ ధర్నా

న్యూఢిల్లీ: తెలంగాణ మార్చ్‌కు మద్దతుగా జంతర్‌మంతర్‌ వద్ద ఢిల్లీ తెలంగాణ జేఏసీ ధార్న చేపట్టింది. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఎన్ని అడ్డంకులు సృష్టించినా మార్చ్‌ విజయవంతం అవుతుందని తేల్చిచెప్పారు. మార్చ్‌కు అనుమతి ఇచ్చి అరెస్టులు చేయడంపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని అక్కడి జేఏసీ నేతలు డిమాండ్‌ వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీలు వినోద్‌, జితేందర్‌రెడ్డితో పాటు పలువురు తెలంగాణవాదులు పాల్గొన్నారు.