జగదేవ్ పూర్ మండలంలో ఘనంగా గోకులాష్టమి

జగదేవ్ పూర్ , ఆగస్టు19 జనంసాక్షి :
జగదేవ్ పూర్ మండలంలో ఆయా గ్రామాల్లోని దేవాలయాల్లో శుక్రవారం గోకులాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా మండల కేంద్రంలో స్థానిక శ్రీ  లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయంలో స్వామివారిని శ్రీకృష్ణుడి అవతారంలో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అదేవిధంగా శ్రీ చైతన్య ఉన్నత పాఠశాలలో  చిన్నారి విద్యార్థినీ విద్యార్థులు గోపిక కృష్ణుల వేషధారణతో అలరించారు. పాఠశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉట్టిని   విద్యార్థినీ విద్యార్థులు కొట్టారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొత్త నర్సింహారెడ్డి మాట్లాడుతూ పండుగల యొక్క విశిష్టత సాంప్రదాయాల పట్ల  విద్యార్ధులకు అవగాహన కల్పించడానికి ఆధ్యాత్మిక కార్యక్రమాలను  దోహదపడతాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ప్రేమలత  ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.