జనహృదయనేత మంత్రి పట్నం

జనహృదయనేత మంత్రి పట్నం

-మహేందర్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు.
-మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్.

 

తాండూరు సెప్టెంబర్ 23 (జనం సాక్షి)
రాష్ట్ర గనులు భూగర్భ సమాచారం శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కి తాండూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విటల్ నాయక్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శనివారం హైదరాబాద్ లోని మంత్రి మహేందర్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగు చ్చంఅందజేసి జన్మదిన శుభాకాంక్షలుతెలిపారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకో వాలని కోరారు. అదేవిధంగా మరెన్నో ఉత్తమ పదవులు చేపట్టాలని భగవంతుని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో యాలల మండలం ఎంపీపీ బాలేశ్వర గుప్తా, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఆశన్న, సప్తగిరి గౌడ్, యలల పిఎసిఎస్ వైస్ చైర్మన్ వడ్డె రాములు, అమర్నాథ్ రెడ్డి లాలప్ప శేఖర్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు తదితరులు ఉన్నారు.