జబ్బార్ గూడ గ్రామంలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాలు

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- కందుకూరు మండల పరిధిలోని జబ్బార్ గూడ లో పోచమ్మ బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ బోనాల ఉత్సవాల్లో సామాజిక వేత్త బజార్ భిక్షపతి కుటుంబ సభ్యులు పాల్గొని పోచమ్మ తల్లి కి బోనం సమర్పించారు ఈ ఉత్సవాల్లో శివశక్తుల విన్యాసాలు పోతురాజు ఆటలు గ్రామస్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఉదయం నుండి సాయంత్రం వరకు ఆడపడుచులు చిన్నారులు  బోనాలను అందంగా అలంకరించుకుని ఊరేగింపులో పాల్గొన్నారు