జమిలి ఎన్నికలకు వైకాపా సానుకూలమే

– ఈ విధానంతో ఖర్చు, అవినీతి తగ్గుతుంది
– వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి
– జాతీయ న్యాయ కమిషన్‌కు లేఖను అందించిన విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి
న్యూఢిల్లీ, జులై10(జ‌నం సాక్షి ) : జమిలి ఎన్నికలకు వైకాపా మద్దతు ప్రకటించింది. ఈ మేరకు జాతీయ న్యాయ కమిషన్‌కు వైకాపా నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఢిల్లీలో లేఖను అందజేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి విూడియాతో మాట్లాడుతూ.. జమిలి ఎన్నికలపై తమ పార్టీ అభిప్రాయాన్ని జాతీయ న్యాయ కమిషన్‌కు అందజేసినట్టు వెల్లడించారు. జమిలి ఎన్నికలతో ఖర్చు, అవినీతి తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్రం, రాష్ట్రంలో హంగ్‌ ఏర్పడితే పరిస్థితి ఏమిటని న్యాయ కమిషన్‌కు అడిగామని.. ఏ ప్రభుత్వమైనా కూలిపోతే మిగిలిన కాలానికే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారని విజయసాయి ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి భాజపా, మిత్ర పక్షాలు అభ్యర్థిని నిలబెడితే మాత్రం తాము మద్దతివ్వబోమని విజయసాయి స్పష్టంచేశారు. ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా ఇవ్వనందున భాజపా అభ్యర్థికి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని విజయసాయి రెడ్డి అన్నారు.
జమిలి ఎన్నికలకు రాజకీయ పార్టీలు జాతీయ న్యాయ కమిషన్‌ నిర్వహించిన సంప్రదింపుల్లో భాగంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేశాయి. ఇప్పటికే నాలుగు పార్టీలు దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు జైకొట్టగా.. తొమ్మిది పార్టీలు వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో మంగళవారం వైకాపా నేతలు న్యాయ కమిషన్‌ను కలిసి తమ మద్దతు ప్రకటించడంతో జమిలికి జైకొట్టిన పార్టీల (తెరాస, శిరోమణి అకాలీదళ్‌, అన్నాడీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ) సంఖ్య ఐదుకు చేరింది.