డీఎస్సీ ఫలితాలు విడుదల

తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. సచివాలయంలో సీఎం రేవంత్‌ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. మార్చి 1న 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చింది. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఫరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.45 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫైనల్‌ కీని సెప్టెంబర్‌ 6న విద్యాశాఖ విడుదల చేసింది.