జమ్మూలో మళ్లీ కాల్పులు

jammu2జమ్మూకాశ్మీర్ లో మరోసారి పాకిస్థాన్ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. ఆర్ఎస్ పురా సెక్టార్ లో బీఎస్ఎఫ్ క్యాంపులపై పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. ఇందులో ఆరుగురు పౌరులు గాయపడ్డారు. గత రెండు రోజుల నుంచి పాక్ బలగాలు ఆర్ఎస్ పురా సెక్టార్ లో కాల్పులు విరమణకు పాల్పడుతూనే ఉన్నాయి. దీంతో పదుల సంఖ్యలో పౌరులు గాయపడుతున్నారు. ప్రాణాలను కాపాడుకునేందుకు బంకర్లలో తలదాచుకుంటున్నారు.