జమ్మూ కాశ్మీర్‌ లో ఏడుగురు మృతి

jyo1జమ్మూ కాశ్మీర్‌ అల్లర్లలో మృతుల సంఖ్య 7కి చేరింది. బుద్గామ్ జిల్లాలో ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరపడంతో.. నలుగురు చనిపోయారు. 15 మంది గాయపడ్డారు. ఇటు అనంతనాగ్‌ లో చెలరేగిన హింసలో మరో వ్యక్తి చనిపోగా.. రాత్రి శ్రీనగర్‌ లో సీర్పీఎఫ్ జవాన్ల కాల్పుల్లో మరో ఇద్దరు మృతిచెందారు. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 65 కు చేరింది. మరోవైపు కాశ్మీర్ వ్యాలీలో 39వ రోజు కూడా కర్ఫ్యూ కొనసాగుతోంది.