జయనగర్‌ ఉప ఎన్నికలో మందకొడిగా పోలింగ్‌

బెంగళూరు,జూన్‌11(జ‌నం సాక్షి): కర్నాటకలోని జయనగర్‌లో సోమవారం ఉప ఎన్నికలు నిర్వహించగా, ఉదయం 11.00 గంటలకు 22.2 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. జయనగర్‌ నియోజకవర్గంలోని సిట్టింగ్‌ ఎమ్మెల్యే బి.ఎన్‌.విజరుకుమార్‌ మృతి చెందడంతో ఎన్నికలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. బిజెపి తరపున బి.ఎన్‌. ప్రహ్లాద్‌, కాంగ్రెస్‌ తరపున సీనియర్‌ నేత, మంత్రి రామలింగా రెడ్డి కుమార్తె సౌమ్యా రెడ్డి అభ్యర్థులుగా పోటీలో పడ్డారు. కాగా, మొత్తం 2.03 లక్షల ఓటర్లు వున్న ఈ నియోజక వర్గంలో ఏడు వార్డులలో 213 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లుఅధికారులు తెలిపారు. అలాగే మహిళా సిబ్బందితో నిర్వహించే ఐదు గులాబి రంగు పోలీంగ్‌ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు.