జయలలితకు అస్వస్ధత

23brk83aచెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంగానే ఉన్నారని చెన్నై అపోలో ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఆమెకు జ్వరం తగ్గింది, విశ్రాంతి తీసుకుంటున్నారని వెల్లడించారు.  డీహైడ్రేషన్ తో ఆమె బాధపడుతోందని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. జయలలితను అబ్వరేషన్ లో ఉంచామని, మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. మరోవైపు ఆస్పత్రి దగ్గర జయమ్మ అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా మోహరించి ఉన్నారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.