జయలలితకు సుప్రీంకోర్టు నోటీసులు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ను తొలగించాలని డీఎంకే నేత వేసిన పిటిషన్పై కోర్టు స్పందించింది. దీంతో కోర్టు జయకు నోటీసులు పంపించింది. కర్ణాటక హైకోర్టులో విచారణపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించింది. డీఎంకే నేత పిటిషన్పై తదుపరి విచారణను కోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది.