కోలుకున్న జయలలిత
గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్తప్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పూర్తిగా కోలుకున్నారని అపోలో చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి తెలిపారు. జయ శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉన్నారన్నారు. జయలలితకు ఉన్న ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గిందన్నారు. జయ డిశ్చార్జ్పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రతాప్ సి.రెడ్డి పేర్కొన్నారు. సెప్టెంబర్ 22న తీవ్ర అస్వస్థతతో జయ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అపోలో వైద్యులతో పాటు లండన్, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు, సింగపూర్కు చెందిన ఫిజియోథెర పిస్ట్లు చికిత్స అందించారు. దీంతో వెంటిలేటర్పై ఉన్న ఆమె ఆరోగ్యం మెరుగపడి, సహజసిద్ధంగా శ్వాస పీల్చుకోగలుగుతున్నారు. ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడటంతో జయను అత్యవసర చికిత్సల విభాగం నుంచి అపోలో ఆస్పత్రి నాల్గవ అంతస్థులో ప్రత్యేక వసతులతో కూడిన ‘ఎల్’ అనే వీఐపీ వార్డుకి మూడు రోజుల క్రితం మార్చారు.