జయ పగ్గాలు పన్నీర్ సెల్వంకు..
చెన్నై: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు సీఎం జయలలిత తీవ్ర అనారోగ్యంతో గత మూడు వారాలుగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జయలలిత శాఖలను ఆమెకు అత్యంత విశ్వాసపాత్రుడిగా పేరొందిన రాష్ట్ర ఆర్థికమంత్రి పన్నీర్ సెల్వంకుజయలలిత పగ్గాలు అప్పగించారు. కేబినెట్ సమావేశాలు ఏర్పాటుచేసే అధికారం సైతం అప్పగిస్తూ రాజ్భవన్ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. జయలలిత తిరిగి విధులు నిర్వర్తించే వరకు ఆమె వద్ద ఉన్న ప్రజా, సాధారణ పరిపాలన, రాష్ట్ర సర్వీసులను పన్నీర్ సెల్వంకు బదలాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.