జర్నలిస్టుల రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి.

టిడబ్య్లూజె ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామచందర్,ప్రధాన కార్యదర్శి కాలురి శ్రీను.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 21(జనంసాక్షి):
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు రామచందర్, ప్రధాన కార్యదర్శి కాలురి శ్రీను పిలుపునిచ్చారు.శుక్రవారం జిల్లా కేంద్రంలో మహాసభలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల కృషిని ప్రభుత్వం మరిచిపొయిందని, జర్నలిస్టుల సమస్య లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు మీడియా అకాడమీ నుంచి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయాల ని , అదేవిధంగా పదేళ్ళపాటు మృతుని కుటుంబానికి ప్రతి నెల పది వేల చొప్పున పించన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.జర్నలిస్టుల హక్కులకోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ విస్తృతంగా పోరాటాలు చేస్తుందన్నారు. ఈ నెల 29 , 30 తేదీలలో హైదరాబాదులో మహసభలు నిర్వహించడం జరుగుతుం దని అన్నారు.నాగర్ కర్నూల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి జర్నలిస్టు మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొని మహసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కందికొండ మోహన్ , జాతీయ కౌన్సిల్ సభ్యులు దూమర్ల భాస్కర్ ,జిల్లా ఉపాధ్యక్షులు పందిరి శ్రీధర్ ,ఎక్బాల్ , పదహారు బాలకృష్ణ పరమేశ్వర్ రమేష్ తదితరులు ఉన్నారు