జాతీయస్థాయి కరాటే పోటీల బ్రోచర్ విడుదల

నాగర్ కర్నూల్ బ్యూరో జులై 4  జనంసాక్షి:
 ఆగస్టు  07 వ తేదీన కల్వకుర్తి సాయి బాలాజీ ఫంక్షన్ హాల్ లో విక్టరీ షోటోఖాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యoలో నిర్వహించబోయే జాతీయస్థాయి కరాటే పోటీలకు సంబంధించిన బ్రోచెర్ ను ఆదివారం హైదరాబాదులోని తీగల కృష్ణారెడ్డి కాలేజీలో సినీ హీరో సుమన్ తల్వార్ నాగర్ కర్నూల్ జిల్లా కరాటే మరియు కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ ముచ్చర్ల జనార్దన్ రెడ్డి,రహమాన్ , అర్జున్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు ఈ సందర్భంగా. సుమన్  మాట్లాడుతూ ఆగస్టులో కల్వకుర్తి లో జరగబోయే జాతీయస్థాయి కరాటే టోర్నమెంట్ కు కరాటే మాస్టర్ లందరూ పాల్గొని విజయవంతం చేయాలని, నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రాండ్ మాస్టర్ మల్లికార్జున్ గౌడ్, సదాశివుడు, శ్రీనివాస్,కిరణ్ నాయక్ ప్రసాద్ గౌడ్, రమేష్, వినోద్ కల్వకుర్తి ఖాదర్ టీం సభ్యులు ఖాదర్ ఉస్మాన్ ఆరిఫ్పుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.