జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న

ఎంపీపీ సుకన్య,  జడ్పిటిసి జంగమ్మ

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి): -75వ భారత స్వతంత్ర వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా గురువారం యాచారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కొప్పు సుకన్య భాష, జెడ్పిటిసి చిన్నోల్ల జంగమ్మ యాదయ్య మండల పరిధిలోని ప్రతి గ్రామపంచాయతీకి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. అనంతరం యాచారం ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి నిర్వహించిన ర్యాలీలో పాల్గొని విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు.  ఎంపీపీ, జడ్పిటిసి మాట్లాడుతూ.. స్వాతంత్రం దిశగా నాడు స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని నింపిన మహానీయుల సంకల్పాలను గుర్తుచేసుకునేలా స్వాతంత్ర్య వేడుకలను ఒక పండుగలా నిర్వహించుకుందామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో విజయలక్ష్మి, తహసిల్దార్ సుచరిత, సర్పంచ్ ముదిరెడ్డి శ్రీధర్ రెడ్డి, హెచ్ఎమ్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.