జాతీయ టీమ్ కెప్టెన్ గా కృష్ణవేణి

మేళ్లచెరువు మండలం( జనం సాక్షి న్యూస్)

తెలంగాణ రాష్ట్ర జూనియర్ జాతీయ టీం కెప్టెన్ గా మే ళ్లచెరువు గ్రామానికి చెందిన పసుపులేటి కృష్ణవేణి ఎన్నికయ్యారు. సెప్టెంబర్ 1 నుండి 4 వరకు బీహార్ రాష్ట్రంలో జరిగే జూనియర్ జాతీయస్థాయి పోటీలలో ఆమె పాల్గొంటారని సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నామ నరసింహ రావు ఒక ప్రకటనలో తెలిపారు. కృష్ణవేణి ఇప్పటి వరకు 5 సార్లు జాతీయ స్థాయిలో రాణించిందని అన్నారు. తన ఎంపిక పట్ల జిల్లా అసోసియేషన్ పెద్దలు రామచందర్ గౌడ్, రామచంద్రయ్య, నాగిరెడ్డి మరియు పలువురు అభినందించారు.