జాతీయ సమైక్యత స్ఫూర్తిని చాటాలి

జిల్లా రైతు బంధు చైర్మన్ వంగేటి లక్ష్మారెడ్డి

రంగారెడ్డి/ ఇబ్రహీంపట్నం, (జనంసాక్షి) :- దేశంలోని అన్ని వర్గాలకు సమానంగా అవకాశాలు రావాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచనా విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు జాతీయ సమగ్రత కోసం కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా రైతు బంధు చైర్మన్ రెడ్డి లక్ష్మారెడ్డి అన్నారు. ‘ స్వతంత్ర భారత వజ్రోత్సవాల’  వేడుకల్లో భాగంగా తమ ఇంటి పై జెండా ఎగర వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 15 రోజుల పాటు రాష్ట్రంలో ద్విసప్తాహం పేరిట నిర్వహిస్తున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు స్ఫూర్తిని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఇటువంటి ఏర్పాటు వాదం, నిర్బంధ వివాదం లేకుండా దేశం మిలిగిన ప్రదేశాల సరసున నిలిచిపోవాలని ఆకాంక్షించారు. తెలంగాణలో బలహీన వర్గాల సంక్షేమం కోసం, ఇప్పటి వరకు సరైన అవకాశాలు రానివారి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ విశేష కృషిని జరుపుతున్నారన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి జాతీ సమైక్యత చాటాలని సూచించారు.