జిల్లా అభివృద్ధికి జిల్లా స్థాయి అధికారులు సహకారించాలి….

-అడిషనల్ కలెక్టర్ అపూర్వ చౌహాన్…
 గద్వాల ప్రతినిధి నవంబర్ 10 (జనంసాక్షి):-  జోగులాంబ గద్వాల జిల్లా అభివృద్ధికి జిల్లా అధికారులు పూర్తిస్థాయిలో సహకరించాలని జిల్లా అదనపు కలెక్టర్ అపుర్వ్ చౌహన్ అన్నారు. గురువారం జిల్లా అడిషనల్ కలెక్టర్ ఛాంబర్ లో అదనపు కలెక్టర్ ను జిల్లా అధికారులు కలిసి అదనపు కలెక్టర్ కు పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు..ఈ సందర్భంగా  అదనపు కలెక్టర్ అపూర్వ చౌహన్ మాట్లాడుతూ వచ్చేవారం అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుంటానని, అదనపు కలెక్టర్ తెలిపారు. జిల్లా అభివృద్ధిలో ప్రతి ఒక్క అధికారి భాగస్వాములై సహాయ సహకారాలు అందించాలని అదనపు కలెక్టర్ జిల్లా అధికారులను కోరారు. ఎలాంటి సమస్య వచ్చినా ఎల్లవేళలా ఇంటిలో కానీ కార్యాలయంలో కానీ మీకు అందుబాటులో ఉంటానని అదనపు కలెక్టర్ జిల్లా అధికారులకు తెలిపారు.ఈ సమావేశంలో వెంకటేశ్వర్లు పశు సంవర్ధక శాఖ  అధికారి,స్త్రీ శిశు సంక్షేమ అధికారి ముసాయిదా బేగం,ఎస్సీ కార్పొరేషన్ అధికారి రమేష్ బాబు, హృదయ రాజు, పూరషోత్తం రెడ్డి,యాదగిరి, ప్రగతి, సిరాజ్జుద్దీన్ లక్ష్మణ్, షకీలా బాను
ఇతర శాఖల జిల్లా అధికారులు అదనపు కలెక్టర్ ను కలిసిన వారిలో ఉన్నారు…