జిల్లా ఆస్పత్రి సందర్శించిన డిప్యూటీ డిఎంహెచ్ఓ,ఎం సి హెచ్ ప్రోగ్రాం ఆఫీసర్

గద్వాల నడిగడ్డ, అక్టోబర్ 21 (జనం సాక్షి);

జోగులాంబ గద్వాల జిల్లా ఆస్పత్రిని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సిద్ధప్ప,ఎం సి హెచ్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శశికళ జిల్లా ఆస్పత్రిలో శుక్రవారం ఐ ఆర్ ఎస్ ఎస్ క్యాన్సర్ స్క్రీనింగ్ లోని వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఎన్సీడీ క్లినిక్ నందు బిపి షుగర్ యొక్క పేషంట్ల వివరాలు,రోజు ఓపి గురించి ఫాలో అప్స్ గురించి ఎమ్మెస్ జనరల్ డాక్టర్ లను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సీడీ జిల్లా కోఆర్డినేటర్ శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.