జిల్లా ఉత్తమ పౌర సేవ అవార్డు అందుకుంటున్న పానుగంటి విష్ణువర్ధన్

కేసముద్రం సెప్టెంబర్ 18 జనం సాక్షి / మండలంలోని అమీనాపురం గ్రామానికి చెందిన పానుగంటి విష్ణువర్ధన్ కు జాతీయ మానవ హక్కుల న్యాయం సేవా సంఘం అధ్యక్షుడు మంగళ పెళ్లి హుస్సేన్ ఆధ్వర్యంలో ఆదివారం మహబూబాబాద్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో జరిగిన సమావేశంలో మహబూబాబాద్ ఉత్తమ పౌర సేవ అవార్డు పానుగంటి విష్ణువర్ధన్ కు ఇచ్చి సన్మానం చేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ విష్ణువర్ధన్ పలు సమస్యలపై స్పందించి బాధితులకు న్యాయం చేస్తున్న క్రమంలో మరియు భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కుల సాధన కోసం చట్టానికి లోబడి నిస్వార్థంగా రాజకీయాలకు అతీతంగా సేవ చేస్తున్నారని అన్నారు.వారి సేవలు గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా విష్ణువర్ధన్ మాట్లాడుతూ ఈ ఆరుదైన గౌరవం రావడం ఎంతో సంతోషమని,మునుముందు పలు సమస్యలపై పోరాటం చేసి బాధితులకు న్యాయం చేస్తానని తెలియజేశారు. ఈ అవార్డు అందజేసిన అధ్యక్షులు మంగళపల్లి హుస్సేన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.