* జిల్లా కేంద్రంలో జరిగే వాల్మీకుల ధర్నాకు తరలివెళ్ళిన మండల వాల్మీకులు నాయకులు*

ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 22 : మండల కేంద్రంతోపాటు పుటాన్ దొడ్డి, బి. వీరాపురం, కోదండపురం, ధర్మవరం, ఎర్రవల్లి చౌరస్తా, కొండేరు, తిమ్మాపురం, జింకలపల్లి, మునగాల తదితర గ్రామాల నుండి వాల్మీకి సోదరులు జిల్లా కేంద్రంలో జరిగే వాల్మీకి ధర్నాకు సోమవారం తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మండల నాయకులు ఎల్కూరు శ్రీనివాసులు, ధర్మవరం నారాయణ నాయుడు లు మాట్లాడుతూ బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నా వెళ్తున్నట్లు వారు తెలిపారు. ప్రభుత్వం వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. వాల్మీకులు అందరు కలిసి భారీ సంఖ్యలో ర్యాలీగా తరలివెళ్ళి కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తిమ్మాపురం శివుడు, సాతర్ల గోవర్ధన్, కంపెనీ రవి, కొండేరు నాయుడు, బి. వీరాపురం గ్రామ సర్పంచ్ రాముడు తోపాటు ఆయా గ్రామాల వాల్మీకి నాయకులు పాల్గొన్నారు.