జిల్లా స్థాయి ఉపన్యాస పోటీలను విజయవంతం చేయండి

మల్దకల్ మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నడిగడ్డ తెలంగాణ సోషల్ ఫోరం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఉపన్యాస పోటీలను ఈ నెల17 న జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు, నడిగడ్డ సోషల్ ఫోరం అధ్యక్షుడు పాల్వాయి లక్ష్మి నారాయణ తెలిపారు. ఉపన్యాసఅంశం భారతదేశంలో పార్టీ ఫిరాయింపుల చట్టం అమలు తీరు,స్పీకర్ తీరు తెన్నులుఅనే అంశం పై ప్రతి పాఠశాలనుంచి ఇద్దరు విద్యార్థులు పాల్గొనాలని,ఈ నెల15 వ  తేదీన మల్దకల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత  పాఠశాలలో ఉపన్యాస పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇమాన్యుల్, ఉపాధ్యాయులు జాకీర్ హుస్సేన్,క్రాంతికుమార్, సిఆర్పి పరమన్న తదితరులు పాల్గొన్నారు.