జీ.ఎస్.టీ బిల్లుతో ట్యాక్స్ టెర్రరిజాన్ని నివారించవచ్చు

modi2జి.ఎస్‌.టి బిల్లుకు అన్ని పార్టీలు ఆమోదించటం చాలా సంతోషంగా ఉందని ప్రధాని మోడీ తెలిపారు. జి.ఎస్‌.టి బిల్లు సవరణపై లోక్‌ సభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. దేశ చరిత్రలో ఇది చారిత్రక బిల్లు కాబోతుందని చెప్పారు. అన్ని పార్టీలు ఈ బిల్లుకు ఆమోదం తెలిపి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాయన్నారు. జి.ఎస్‌.టి బిల్లు కారణంగా దేశంలో ట్యాక్స్ టెర్రరిజాన్ని పూర్తిగా నివారించవచ్చన్నారు. కొత్త పన్నుల విధానం పూర్తి పారదర్శకంగా ఉంటుందని ప్రధాని మోడీ చెప్పారు.