జుక్కల్ లో ఘనంగా భగవాన్ బలరామ జయంతి   

జుక్కల్ లో ఘనంగా భగవాన్ బలరామ జయంతి

 

జుక్కల్, సెప్టెంబర్ 23, (జనంసాక్షి)
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలకేంద్రంలో భారతీయ కిసాన్ సంఘ్ అధ్వర్యంలో శనివారం
భగవాన్ బలరామ జయంతిని ఘనంగా నిర్వహించారు.బలరాముని చిత్రపటానికి కుంకుమ,పసుపు,పూలతో పూజించారు.అగర బత్తులను వెలిగించి టెంకాయ కొట్టారు.ఈ సందర్బంగా జుక్కల్ మండల భారతీయ కిసాన్ సంఘ్ అద్యక్షులు నాగల్ గిద్దే శ్రీనివాస్ మాట్లాడుతు భగవాన్ బలరామ జయంతిని రైతు దినోత్సవాలుగానిర్వహించుకుంటున్నామని తెలిపారు.రైతు సమస్యలను భారతీయ కిసాన్ సంఘ్ దృష్టికి తీసుకు వస్తే పరిష్కరించడానికి కృషిచేస్తామని తెలిపారు. వ్యవసాయ విద్యుత్తు సమస్యలు, వ్యవసాయ రుణాలు, రైతుభీమా, రైతు బంధు, ఇంకా రైతులకు సంబందించిన సమస్యలు ఏవి ఉన్నా పరిష్కరించడానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం ఉపాధ్యక్షులు చాకలి కృష్ణ, స్ధానిక సింగిల్ విండో అధ్యక్షులు నాగల్ గిద్దే శివానంద్, ఏ ఈ నరేందర్, రైతు నాయకులు మాధవ రావ్ దేశాయ్, శివరాజ్ దేశాయ్,బసవరాజు రెడ్డి, బాలాజి పటేల్, దుర్గన్న, ఆలూరి సంగప్ప,గంగాధర్, రాజప్ప,ఉమాకాంత్,ఘోరఖ్ నాథ్,రైతులు పాల్గొన్నారు.