జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న

జడ్పీటీసీ స్వప్నభాస్కర్

జహీరాబాద్ ఆగస్టు 15 (జనంసాక్షి ) జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్రం జిల్లా పరిషత్ ఆవరణలో 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు లో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎందరో మహానుభావుల త్యాగాలను స్మరించుకుంటూ జాతిపిత ‘మహాత్మా గాంధీ’విగ్రహానికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి తో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న న్యాల్కల్ జడ్పీటీసీ స్వప్నభాస్కర్ కార్యక్రమంలో సీఈఓ ఎల్లయ్య, వైస్ చైర్మన్ కుంచాల ప్రభాకర్, వివిధ మండలాల జడ్పీటీసీ సభ్యులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.