హైదరాబాద్: జేఎన్టీయూలో వంద కోట్ల స్కాం జరిగిందని సీపీఐ పొలిట్బ్యూరో సభ్యులు నారాయణ ఆరోపించారు. నేటి ఉదయం గవర్నర్ నరసింహన్ను ఆయన కలిసారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ స్కాం పై తక్షనం విచారణ జరిపించాలని గవర్నర్ను కోరామన్నారు. రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన నారాయణ కాకినాడ జేఎన్టీయూలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు.