జైట్లీ సభను తప్పుదోవ పట్టిస్తున్నారు: జైరాం

దిల్లీ: ప్రైవేటు బిల్లుపై అరుణ్‌జైట్లీ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్‌ ఆరోపించారు. రాష్ట్రపతి ఆమోదంతోనే కేవీపీ ప్రైవేటు బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారని.. అప్పుడు ఇది ద్రవ్యబిల్లా? కాదా? అన్నది ప్రభుత్వానికి తెలియదా? అని ప్రశ్నించారు. అప్పుడు సభా సాక్షిగా ప్రధాని ఇచ్చిన హామీలను నెరవేరుస్తారా? లేదా? అన్నదానిపై జైట్లీ స్పష్టత ఇవ్వాలని కోకారు.