*జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న :-కమిడియన్ శ్రీ లక్ష్మి

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను మంగళవారం  సినిమా కమిడియన్ శ్రీలక్ష్మి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి పురేందర్,వేదపండితులు స్వాగతం పలికారు, అనంతరం ఉభయ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శాలువాతో సత్కరించి, ఆలయ ప్రతిష్టతను  వివరించి తీర్థప్రసాదాలు అందజేశారు.