జోద్‌పూర్‌ చేనేత గోడౌన్‌లో అగ్నిప్రమాదం

జైపూర్‌: రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌ జాతీయ చేనేత గోదాములో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న 12 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో రూ. కోట్లలో ఆస్తినష్టం వచ్చిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.