జ్ఞాన సంపన్నుడు అంబేద్కర్

శ్రీరాంపూర్ జిఎం కార్యాలయంలో ఘనంగా జరిగిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం.
శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఎస్సీ మరియు ఎస్టి ఉద్యోగస్తుల నేతృత్వంలో జరిగిన బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కార్యాలయ అధికారులు మరియు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి సంజీవరెడ్డి హాజరై బాబాసాహెబ్ మహోన్నత జ్ఞాన సంపన్నుడు అని ఈరోజు మనం అందరం ఇంత చక్కగా ఉద్యోగం చేస్తున్నాము అంటే అది బాబా సాహెబ్ మనకు రాజ్యాంగం ద్వారా ప్రసాదించిన అవకాశం అని మన అభివృద్ధికి డాక్టర్ బాబాసాహెబ్ కారణం అని పేర్కొన్నారు అలాగే అంబేద్కర్ భారత దేశంలో మాత్రమే కాక ప్రపంచ మేధావి అని బుధవారం ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ జయంతి మరియు వర్ధంతి కార్యక్రమములు కుల మతాలకతీతంగా ఘనంగా జరుపుకోవడమే దానికి నిదర్శనం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ టూ జిఎం రఘు కుమార్ ,డిజిఎం (ఐఇ ) చిరంజీవులు , డీజీఎమ్ (పీ ఆర్ )అరవింద రావు గారు, ఎస్సీ లైజన్ అధికారి కిరణ్ కుమార్ మరియు ఎస్టి లైజాన్ అధికారి శ్రీనివాస్ , వివిధ డిపార్ట్మెంట్ అధికారులు,ఎస్సి, ఎస్టీ మహిళ విభాగం అధ్యక్షురాలు ప్రబంధిత , ఎస్సి, ఎస్టీ జిఎం ఆఫీస్ కార్యాలయం సెక్రటరీ బాపయ్య మరియు కార్యాలయ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.