టీంమిండియాకు ప్రముఖుల శుభాకాంక్షలు
ఢిల్లీ: ప్రపంచ క్రికెట్కప్లో వరుస విజయాలతో అప్రతిహతంగా దూసుకెళ్తున్న టీంమిండియాకు దేశంలోని పలువురు ప్రముఖులు శుభాంక్షాలు తెలిపారు. మెల్బోర్న్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ ల మధ్య నేడు జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. భారత్ సెమీస్కు దూసుకెళ్లిన సందర్భంగా ధోనీ సేనకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మిగితా మ్యాచ్ల్లోనూ గెలిచి వరల్డ్కప్ను తీసుకురావాలని ఆకాంక్షించారు.