టీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మెదక్, జనంసాక్షి: మరోసారి సీమాంధ్ర సర్కారు తన దురహంకారాన్ని ప్రదర్శించింది. సీఎం కిరణ్ జిల్లాలో ఇవాళ పర్యటించనున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పలువురు తెలంగాణవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం కిరణ్ జిల్లా పర్యటనలో తెలంగాణ వాదులు అల్లర్లకు పాల్పడవచ్చనే ఉద్దేశ్యంతో వారిని అదుపులోకి తీసుకున్నామని పోలీసు అధికారులు తెలిపారు. సంగారెడ్డిలో ‘ఇందిరమ్మ కలలు’, ‘అమ్మహస్తం’ కార్యక్రమాలను ప్రారంభించేందుకు సీఎం కిరణ్ ఇవాళ జిల్లాలో పర్యటించనున్నారు.