కాజీపేటలో రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీలో వందేభారత్‌ బోగీలూ తయారీ

`రూ.750 కోట్లతో రైల్వే మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌
` పనులను పరిశీలించిన కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌..
హనుమకొండ(జనంసాక్షి): ఖాజీపేట రైల్వే మానుఫ్యాక్చరింగ్‌ ప్రాజెక్ట్‌ వల్ల చాలా మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ అన్నారు. దేశంలోనే ఇది.. పెద్ద రైల్వే మానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ అని.. వందేభారత్‌ బోగీలు కూడా ఇక్కడే తయారవుతాయని మంత్రి వెల్లడిరచారు. 2026 నాటికి కాజీపేటలో రైల్వే కోచ్‌ల ఉత్పత్తి ప్రారంభం అవుతుందని.. కాజీపేట నుంచి త్వరలోనే 150 లోకోమోటివ్‌లు కూడా ఎగుమతి అవుతాయని కేంద్రమంత్రి చెప్పారు. త్వరలోనే కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీలో మెట్రో కోచ్‌లు కూడా తయావుతాయని రైల్వే మంత్రి చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో భారతీయ రైల్వేలు పురోగమిస్తున్నాయని మంత్రి వెల్లడిరచారు. కాజీపేటలో 750 కోట్ల రూపాయలతో రైల్వే మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. పనుల పరిశీలన నిమిత్తం శనివారం కేంద్రమంత్రులు యూనిట్‌ను సందర్శించారు. తెలంగాణలో ఇదో పెద్ద ప్రాజెక్టు అని చెప్పిన కేంద్రమంత్రి.. ఈ సందర్భంగా ప్రాజెక్ట్‌ నిర్మాణ పనుల పురోగతిని అధికారులు కేంద్ర మంత్రులకు వివరించారు. అనంతరం అశ్విని వైష్ణవ్‌ విూడియాతో మాట్లాడుతూ..కాజీపేటలో మెగా రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని కేంద్రం నిర్మిస్తోందని..పనులు వేగంగా సాగుతున్నా యని అన్నారు. కాజీపేట రైల్వే కోచ్‌ పరిశ్రమ వరంగల్‌ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అని.. ఆ కోరికను ప్రధాని నరేంద్ర మోదీ నెరవేర్చారని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు. కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ పనులను కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులు కేంద్ర మంత్రులకు వివరించారు. భవిష్యత్తులో కాజీపేట ఫ్యాక్టరీలో మెట్రో కోచ్‌లు కూడా తయావుతాయని అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడిరచారు. వరంగల్‌ ప్రజల కోరికను ప్రధాని నరేంద్ర మోడీ నెరవేర్చారని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. కాజీపేట రైల్వేకోచ్‌ పరిశ్రమ అనేది వరంగల్‌ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అని అన్నారు. కాజీపేట రైల్వే కోచ్‌ పరిశ్రమ అనేది 40 ఏళ్ల పోరాటమని, పివి నరసింహారావు కూడా కాజీపేట రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ కోసం ప్రయత్నించారని కిషన్‌ రెడ్డి అన్నారు. రైల్వే వ్యాగన్లు, కోచ్‌ లు, ఇంజిన్ల తయారీ పరిశ్రమను కాజీపేటకు ప్రధాని మంజూరు చేశారని, మోడీ ఏదైనా మాట ఇస్తే.. తప్పకుండా నెరవేరుస్తారని పేర్కొన్నారు.మోడీ గ్యారెంటీకి ప్రతిరూపమే కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ అని కోచ్‌ ఫ్యాక్టరీకి ప్రధాని స్వయంగా భూమిపూజ చేశారని అన్నారు. కోచ్‌ ఫ్యాక్టరీతో 3 వేల మందికి నేరుగా ఉపాధి కల్పిస్తామని, తెలంగాణలోని 40 రైల్వే స్టేషన్లను ఆధునికరిస్తున్నాం అని తెలియజేశారు. వరంగల్‌ కు ఎయిర్‌ పోర్టు కూడా ఇప్పటికే రావాల్సి ఉందని, ఎయిర్‌ పోర్టుకు భూములివ్వాలని గతంలో మాజీ సిఎం కెసిఆర్‌ ను కోరామని చెప్పారు. భూసేకరణ గురించి ఈ ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నామని, ఎంత త్వరగా భూములిస్తే.. అంత త్వరగా ఎయిర్‌ పోర్టు పూర్తవుతుందని కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. కాజీపేట మానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ తెలంగాణ ప్రజల చాలా ఏళ్ల కల అని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు.